Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విజ్ఞానాన్ని స్వచ్ఛందంగా ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారు - లయన్‌ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

    Author VENKATESH | 13 Jun 2026, 07:11 PM | TELANGANA
    విజ్ఞానాన్ని స్వచ్ఛందంగా ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారు - లయన్‌ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

    కౌమార యువతలో పాఠ్యాంశాలతో పాటు సరైన ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందిస్తేనే విజ్ఞాన వివేక సమపన్నులు అవుతూ రేపటి భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందిస్తారని లయన్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ సింహరాజు కోదండరామ్ అన్నారు. ఈ రోజు స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో శాతవాహన లయన్స్ క్లబ్‌ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల లయన్స్‌ క్వెస్ట్‌ టీచర్‌ ట్రైనింగ్ వర్క్‌షాప్ ముగింపు ‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీన్‌ ఏజ్ యువతలో సామాజిక భావోద్వేగాలను నియంత్రిస్తూ దానికి అనుగుణంగా వారి మానసిక స్థాయిని సరైన పద్ధతిలో మార్గదర్శనం చేయడానికి లయన్స్‌ క్వెస్ట్‌ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కౌమార యువతలో వ్యక్తిగత శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యత సాధించేందుకు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్‌ క్వెస్ట్‌ శిక్షణ దోహదపడుతుందని విశిష్ట అతిథిగా హాజరైన లయన్‌ ఎం భద్రేశం అన్నారు. ఈ సందర్భంగా మరో విశిష్ట అతిథి లయన్‌ ఎ శివ ప్రసాద్‍, పిడిజీ మాట్లాడుతూ మార్కులు, ర్యాంకుల చుట్టు తిరుగుతున్న నేటి విద్యావిధానంలో పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి జరగడానికి లయన్స్‌ క్వెస్ట్‌ దోహదపడుతుందని, దాని ప్రయోజనాలు విద్యార్థులకు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్‌ లయన్‌ పి ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు తయారు చేసిన అంశాలతో కూడిన శిక్షణ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని, విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అలవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. చైర్మన్‌ లయన్‌ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థి చుట్టు సహచరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌర సమాజం వలయం ఏర్పడిందని, దీని ప్రాముఖ్యతను పిల్లలకు అవగాహన కల్పించడం శుభపరిణామం అని సూచించారు. సభాధ్యక్షత వహించిన లయన్‌ పి ప్రవీణ్ మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి ఉచితంగా చేస్తున్న లయన్స్‌ క్వెస్ట్‌ టీచర్ల శిక్షణకు ఈ పాఠశాల ముందుకు రావడం, చురుకుగా పనిచేయడం హర్షణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డితో పాటు శాతవాహన లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎం మహెందర్‌, జిఎల్‌టీ కోఆర్డినేటర్ ఈ రమేష్, రీజియన్‌ చైర్మన్ లయన్‌ వి జగదీశ్వర చారి, కోశాధికారి లయన్‌ పి సురెందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2-రోజుల శిక్షణ కార్యక్రమంలో మాస్టర్‌ ట్రేనర్‌ కె రేణుకతో పాటు అతిథులను పాఠశాల యాజమాన్యం పక్షాన లయన్‌ పి ఫాతిమా రెడ్డి, ప్రిన్సిపల్‌ ప్రియదర్శినిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్సన్‌ స్కూల్‌కు చెందిన 24 మంది, విజన్‌ హైస్కూలు ‌‌ ఉపాధ్యాయులు ఐదుగురు శిక్షణ పూర్తి చేసుకొని ధృవపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల అనుభవాలకు అతిథులు హర్షం వ్యక్తంచేశారు.