Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెండేళ్లలో భారీగా పెట్టుబడులు సాధించాం - నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు

    Author VENKATESH | 12 Jun 2026, 12:26 PM | ఆంధ్రప్రదేశ్
    రెండేళ్లలో భారీగా పెట్టుబడులు సాధించాం - నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు

    సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందుచూపుతో కూడిన ఆర్థిక అజెండా ఇవన్నీ పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే గత రెండేళ్లలో తమ రాష్ట్రం 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని స్పష్టం చేశారు. ఇవి ఏపీలో భారీ మొత్తంలో ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర దీర్ఘకాల ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రపతిభవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ 11వ పాలకమండలి సమావేశంలో ప్రసంగించిన సీఎం వివిధ అంశాలను ప్రస్తావించారు.


    నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు (ETV Bharat)
    కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌తో కలిసి పనిచేస్తాం: నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో భారతదేశం విధానపరమైన పక్షవాతం నుంచి బయటపడి అభివృద్ధి దిశలో పరుగులు తీస్తోందని అన్నారు. సరళీకృత విధానాలు, పాలనా సంస్కరణలు, సులభతర వాణిజ్య విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని చెప్పారు. ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యసాధన ద్వారా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

    ఏఐ సహకారంతో విశ్లేషించి మెరుగైన సేవలు: ఏపీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించారు. మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉన్నత శ్రేణి ఉద్యోగాల కల్పన, సామాజిక మౌలిక వసతుల బలోపేతం, నీరు, ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

    ఇవి కూడా చదవండి

    రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ ద్వారా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో సేకరించి, ఏఐ సహకారంతో విశ్లేషించి మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. రాష్ట్రాలు మౌలిక వసతులపై దృష్టి సారించాలన్న ఆయన రెగ్యులేటరీ వ్యవస్థలు స్థిరంగా ఉండాలన్నారు. లాజిస్టిక్స్‌ మెరుగుపరుచుకోవాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కేవలం ప్రోత్సాహకాల ఆధారిత పోటీపై ఆధారపడకుండా అనుమతులను వేగంగా ఇవ్వాలన్నారు.

    వైద్య రంగంలో కొత్తగా సంజీవని ప్రాజెక్టు ప్రారంభం: గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, సురక్షిత కుళాయినీరు, వంట గ్యాస్, విద్యుత్తు, డిజిటల్‌ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లాంటి ఏడు సౌకర్యాలను ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందని సీఎం చంద్రబాబు అన్నారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి ఈ ఏడు సేవలు అత్యంత ముఖ్యంగా పేర్కొన్నారు. సమాజంలో 10శాతం మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20శాతం కుటుంబాలను దత్తత తీసుకొని వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే పీ4 విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంజీవని ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు. వ్యాధులను ముందుగానే పసిగట్టి, నివారణకు అవసరమైన వైద్యసౌకర్యాలు అందించేందుకు వీలుగా డిజిటల్‌ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.

    భవిష్యత్తులో మానవ వనరుల కొరత: యోగా, ధ్యానం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం నాణ్యమైన మానవ వనరులను సిద్ధం చేయడానికి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత అభ్యసన విధానాలు ప్రారంభించామన్నారు. ఉన్నత విద్యతో పారిశ్రామిక రంగాన్ని అనుసంధానం చేసి ఉద్యోగాలకు అనువైన కోర్సులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ లాంటి అధునాతన రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో సంతాన సాఫల్య నిష్పత్తి 1.5 లోపునకు పడిపోయిందన్న సీఎం భవిష్యత్తులో ఏర్పడే మానవ వనరుల కొరత, వయోభారం ద్వారా తలెత్తే ప్రమాదాన్ని పసిగట్టి దీర్ఘకాల ఆర్థిక సుస్థిరత కోసం పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ తీసుకొచ్చామన్నారు. అన్ని రాష్ట్రాలూ జనాభా సమతౌల్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.