Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలి.

    Author VENKATESH | 17 Jul 2026, 09:28 PM | నారాయణపేట
    ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలి.

    - టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్
    నారాయణపేట, జూలై 17 (బి వి కే న్యూస్)
    ప్రగతిశీల ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్స్ యూనియన్ అనుబంధం టి యు సి ఐ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం టి యు సి ఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రఘు అధ్యక్షత వహించగా టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్  ప్రసంగిస్తూ
    ప్రైవేట్  స్కూల్  బస్సు డ్రైవర్ కు చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. సీట్ కెపాసిటీకి మించి విద్యార్థులని ఎక్కించిన బాధ్యత తోటి విద్యార్థులను పాఠశాలకు చేర్పించడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనికి మించిన భారంతో మానసికంగా కృంగి కృషించిపోతున్నారన్నారు. ఫిట్నెస్ లేని బస్సులను ఇచ్చి డ్రైవర్స్ మీద నెట్టివేయడం దారుణం అన్నాడు. ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూలు బస్సు డ్రైవర్స్ కి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బోర్డ్ ద్వారా ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్స్ పట్ల దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలన్నారు. చట్ట ప్రకారం తగిన వేతనాలు ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడుకోవాలని గుర్తు చేశారు. స్కూల్ బస్సు డ్రైవర్స్ పైన అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయని ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డ్రైవర్స్ కి పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ సందర్భంగా సంఘటితంగా పోరాడాలని అందుకోసం టియుసిఐ యూనియన్ ఎల్లవేళలా మీ వెంబడి ఉంటదని చెప్పారు.
    కార్యక్రమంలో ఇ రమేష్, రఘు, భీమయ్య, భాస్కర్ రెడ్డి,శివ, పరశురాం, అనిల్, వెంకట్ రెడ్డి , గోవింద్, సంజీవ్, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.