Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

    Author VENKATESH | 13 Jun 2026, 12:45 PM | కర్నూలు
    ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

    ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా (AP Minister TG Bharat) వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) మంత్రి భరత్ కర్నూల్‌లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 19 కంపెనీల్లో 1460 ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించామని తెలిపారు. ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
    ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఓర్వకల్లుకు గతంలో ఎప్పుడు లేనంతగా కంపెనీలు తీసుకువస్తున్నామని తెలిపారు. రిలయన్స్, అగస్త్య కంపెనీలను కర్నూలుకు తీసుకువచ్చామని ప్రస్తావించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడిని పెడుతోందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ప్రపంచంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే 25 శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని మంత్రి భరత్ పేర్కొన్నారు