Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

    Author VENKATESH | 11 Jun 2026, 04:36 PM | TELANGANA, కామారెడ్డి
    కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

    హైదరాబాద్, జూన్ 11: కామారెడ్డి పంచాయితీ మరోసారి గాంధీభవన్‌కు చేరింది. ఈరోజు(గురువారం) పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ వల్లనే కామారెడ్డిలో 20 ఏళ్లుగా పార్టీ గెలవడం లేదని చెప్పారు. గత 20 రోజులుగా కామారెడ్డి పంచాయితీ.. కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. సీనియర్ నేత షబ్బీర్ అలీ, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. వీరిద్దరూ రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. అలాగే చంద్రశేఖర్ తనను తిట్టారంటూ షబ్బీర్ అలీ ఆరోపించారు.

    షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు చంద్రశేఖర్ హాజరయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా లిఖితపూర్వకంగా క్రమశిక్షణ కమిటీకి వివరించారు. షబ్బీర్ ఆలీ తీరుతో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించాలని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షబ్బీర్ అలీ ఆడియో వైరల్ అవుతోంది. దీనిపై కూడా క్రమశిక్షణ కమిటీకి చంద్రశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

    ఇవి కూడా చదవండి