మహిళా సాధికారతలో భారత్ ప్రపంచానికి ఆదర్శం- స్థానిక పాలనలో 10 లక్షలకు పైగా ప్రాతినిధ్యం : యూఎన్లో పర్వతనేని హరీశ్
మహిళా సాధికారత, శాంతి భద్రత పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ వెల్లడించింది. మహిళాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడే శాశ్వత ఫలితాలు సాధ్యమవుతాయమని భారత్ అనుభవం నిరూపించిందని పేర్కొంది. మహిళలు, శాంతి, భద్రత అంశంపై జరిగిన యూఎన్ఎస్సీ బహిరంగ చర్చల్లో మాట్లాడిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని ఈ మేరకు ఇండియా సాధించిన విజయాలను ప్రస్తావించారు.