ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి
: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ నారాయణపేట జిల్లా, జూన్ 15 (బి వి కే న్యూస్ ) ఇటీవల పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓలుగా బాధ్యతలు స్వీకరించిన దామరగిద్ద ఎస్ఐ నరేష్ మరియు కోస్గి ఎస్ఐ పురుషోత్తం నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు అభినందనలు తెలియజేసి, తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు. మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు. గ్రామాలు,...