ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. గొడ‌వ ప‌డ్డ క్రికెట‌ర్లు..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే క‌న్ఫ్యూజ్ కూడా చేస్తోంది. ఏది మంచో ఏది చెడో తెలియని సంద‌ర్భం ఎదుర‌వుతోంది. కొన్ని ఏఐ వీడియోలు ఇక జ‌నాల‌ను తీవ్ర టెన్ష‌న్‌లోకి నెట్టేస్తున్నాయి. వీడియో మాయాజాలంతో క్రికెట్ అభిమానుల్ని కొంద‌రు బోల్తా కొట్టిస్తున్నారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో ఇండియా త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌( India vs Pakistan )లో 64 ర‌న్స్ తేడాతో భార‌త్ విక్ట‌రీ కొట్టింది. కానీ హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌, పాక్ క్రికెట‌ర్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. కానీ వాస్త‌వానికి మ్యాచ్‌లో అలాంటి సంద‌ర్భం ఏదీ చోటుచేసుకోలేదు. భార‌తీయ బ్యాట్‌వుమెన్‌ను ఓ పాకిస్తానీ క్రికెట‌ర్ రెచ్చ‌గొట్టిన‌ట్లుగా...