ఐర్లాండ్‌లో కొనసాగుతున్న అల్లర్లు..!

హైదరాబాద్‌హైదరాబాద్‌ : విధ్వంసకరమైన ఆటతీరుతో చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఇండియన్‌ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యంశీ అంతర్జాతీయ క్రికెట్‌ ఎంట్రీపై అనిశ్చితి నెలకొంది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌లోని) బెల్ఫాస్ట్‌లో జరగాల్సిన టీ20 సిరీస్‌కు స్థానికంగా చెలరేగిన హింసాత్మక అల్లర్లు, వలస వ్యతిరేక నిరసనల కారణంగా అంతరాయం కలగడంతో 15 ఏళ్ల వైభవ్ తొలి మ్యాచ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. లిస్‌బర్న్‌లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ ఇప్పటికే రద్దు చేయబడింది