అకాల మరణం పొందిన దూడపాక రాజయ్య గారి కుటుంబాన్ని పరామర్శ

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జై భీమ్ కమిటీ. అకినపల్లి గ్రామానికి చెందిన కీ.శే. దూడపాక రాజయ్య గారు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.దీని కారణంగా ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ జై భీమ్ కమిటీ సంఘ సభ్యులు అందరూ కలిసి మృతుని కుటుంబాని పరామర్శించి మానసిక భరోసా కల్పించారు..అదేవిధంగా చిన్న చేయుతగా రైస్ బ్యాగ్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ దూడపాక రమేష్,ఉపాధ్యక్షులు దూడపాక సమ్మయ్య,ప్రధానకార్యదర్శి దూడపాక రాజు,కోశాధికారి గడ్డం రమేష్,ముఖ్య సలహాదారు పొతారపు సంతోష్, దూడపాక జలంధర్, సరిగొమ్ముల సదానందం , సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.