తీర్థయాత్రలో కొత్త ట్రెండ్‌..

ఒకప్పుడు తీర్థయాత్ర అంటే రద్దీగా ఉండే రైళ్లు, ఎక్కువసేపు క్యూల్లో నిలబడటం, సాధారణ వసతి, అందరితో కలిసి భోజనం చేయడం, రోడ్డు ప్రయాణంలో గంటల తరబడి గడపడం వంటివి సహజంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆధ్యాత్మిక యాత్రను కూడా సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఆస్వాదించేందుకు కొత్త రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.కేదార్‌నాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు గంటల తరబడి నడవాల్సిన అవసరం లేకుండా హెలికాప్టర్‌ సేవలను ఉపయోగించవచ్చు. చార్‌ధామ్‌ యాత్రకు కూడా ప్రత్యేక హెలికాప్టర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విమాన ప్రయాణంతో పాటు ప్రీమియం హోటళ్లలో బస, స్థానికంగా ప్రత్యేక సహాయం, దర్శనానికి ప్రాధాన్యం వంటి సదుపాయాలు ఉంటాయి. 2026లో అందుబాటులో ఉన్న...