నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15: రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈరోజు(శనివారం) అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ వద్ద మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందన్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ కూడా దిగులు పడొద్దని.....