రజనీకాంత్ ‘ధర్మన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధర్మన్ ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ l తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ( బ్యానర్పై ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.