సీఎం రేవంత్ రెడ్డి పై కేశవపట్నం పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
హింసను,ఆత్మహత్యలను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపాటు శంకరపట్నం,జూలై 14,( తెలంగాణ కిరణం విలేఖరి ):ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.శంకరపట్నం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కేశవపట్నం పోలీస్ స్టేషన్లో సీఎంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజకీయ ప్రత్యర్థులను మరియు రైతులను ఉద్దేశించి హింసను,ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన...