ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ప‌శ్చిమాసియా దెబ్బ‌..

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ‌ భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (Banking), రియల్టీ (Realty), ఆటో స్టాక్స్‌ (Auto stocks) లో భారీగా నష్టాలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 561.46 పాయింట్లు నష్టపోయి 77,054.94 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 159 పాయింట్లు క్షీణించి 24,052.05 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. కొన్ని రక్షణాత్మక...