జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం

సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వమని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, ఏదో ఒక అరాచకం జరిగేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చిపోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. అనంతపురంలో జరిగిన...