సర్‌ ప్రక్రియకు సహకరించాలి

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి అయిందని, మిగితా 50 శాతం చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలలో ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతుందని రాజకీయ...