హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశాడు. విద్యానగర్ భక్తాంజనేయ స్వామి ఆలయానికి తన కొడుకుతో వెళ్లి పూజలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షు చల్లగా ఉండాలని ప్రార్థించాడు.Legislative Branch హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు. స్పోర్ట్స్‌ ఇంజురీ కారణంగా ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేరాడు. కాగా, హిమాన్షు గాయపడిన ఉదంతంపై ఆయన తండ్రి, బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘నా కుమారుడు హిమాన్షు నిన్న సాయంత్రం ఒక చిన్న స్పోర్ట్స్‌...