ఓటరు జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి: దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : డిండి మండలం, గుండ్లపల్లి గ్రామంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి బిఎల్ఎ లు మరియు ముఖ్య నాయకుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మరియు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పున్న కైలాష్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పార్టీ...