జియో కొత్త విప్లవం.. 'హేయ్ జియో' ఏఐ ఏజెంట్.. స్మార్ట్ హోమ్ కోసం 'టెలిఫ్రేమ్'
ముంబై, జూన్ 19: ఏటా సరికొత్త సాంకేతికతలతో కస్టమర్లను ఆకట్టుకునే రిలయన్స్ జియో.. ఇవాళ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (AGM) వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. కృత్రిమ మేధను దేశ పౌరులందరికీ మరింత చేరువ చేస్తూ.. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', ఇంకా 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా జియో యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏజీఎంలో ప్రకటించిన ఆ విప్లవాత్మక ఫీచర్ల వివరాలేంటో చూద్దాం..