🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jun, 2026 | Page: 1

భూసార "పునరుద్ధరణ" తో మానవ‌ మనుగడ

(జూన్17 న ప్రపంచ ఎడారీకరణ కరువు దినోత్సవం సందర్భంగా)

నేలల తీరుతెన్నులే ప్రపంచ ఆహార భద్రత ను నిర్ణయిస్తాయి. భూమి లోని సహజ పోషకాలు వ్యవసాయానికి ఆవరణ వ్యవస్థకు ఉపయోగపడుతాయి. భూసారం సకల జీవ జాతులకు ఆహారం ఆవాసాన్ని అందించి మానవ నాగరికతకు పునాదిగా నిలుస్తుంది.
భూమి ప్రకృతి ప్రసాదితం
భూమిని పెంచలేము ఉన్న భూమిని సoరక్షించుకుంటేనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.
ఎడారీకరణ వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోవడమే ఎఢారీకరణ అంటారు.
ఎడారులు వేరు‌ ఎడారీకరణ వేరు
భూ క్షీణతకు మరొక రూపమే ఎడారీకరణ .మానవుని చర్యలు వాతావరణం మార్పులు కారణంగా భూమి ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడాన్ని ఎడారీకరణగా భావిస్తారు. భూమి మనుషులకే కాక సకల జీవ జాతులకు ఆహారాన్ని ఆవాసాన్ని అందించే ఏర్పాటు ప్రకృతి చేసింది.కాలుష్యం అడవుల నరికివేత యుధ్ధాలు లాంటివి ఎడారీకరణ కు దారి తీస్తున్నాయి. ఎడారీకరణ ‌వలన‌ భూమి నిస్సారంగా మారుతుంది. ఆహార కొరతనీటికొరతఏర్పడుతుంది.
ఆర్థిక వ్యవస్థలో వలసలు పేదరికం' నిరుద్యోగం పెరుగుతుంది.
2026 సం" థీమ్
ప్రపంచ ఎడారీకరణ
మరియు కరువు నివారణ దినోత్సవం యొక్క ఇతివృత్తం
పచ్చిక బయళ్ళు (మేత భూములు) గుర్తించండి గౌరవించండి పునరుద్ధరించండి. అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు .

2026 సం" ప్రపంచ స్థాయి అధికారిక వేడుకలకు కెన్యా దేశం ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఆఫ్రికా ఖండంలో ఈ వేదికలు జరగడం ప్రథమం.

ఈ ఏడు థీమ్ ప్రకారం
పచ్చిక బయల్లను పర్యావరణ వ్యవస్థను రక్షించడం .భూమి క్షీణతను( కోతను) నివారించడం . పశువుల పెంపకం దారుల జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది.


పర్యావరణ వేత్తలు ఆందోళన
భూమిపై జనాభా రోజురోజుకు పెరుగుతోంది .పెరుగుతున్న జనం అవసరాలు తీర్చడానికి ప్రకృతి ప్రసాదించిన నిర్మిత భూ భాగంలోనే అధిక ఉత్పత్తి చేపట్టాలి .దీనికోసం భూమి శాస్త్రీయ పరిశోధనలు ఫలితాలు ఉపయోగించి
అధిక దిగిబడుల కోసం రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు జలవనరుల వినియోగం ప్రకృతి భరించలేని స్థాయిలో పెంచుకుంటు పోతున్నాం. 2014 సంవత్సరంలో150 కోట్ల హెక్టార్ల అటవీ భూములను చిత్తడి నేలలను పంట భూములుగా మార్చివేశాం 2050 సంవత్సరం నాటి కి భూవిస్తీర్ణం 10 శాతం వరకు పడిపోతుందని పర్యావరణ‌ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూమి నిర్జీవమై ఎడారిగా మారుతుంది అడవులను చిత్తడి నేలను తోటలుగా' వ్యవసాయ భూములుగా మార్చడం వలన పొలాలు క్రమంగా భూసారాన్ని జీవాన్ని కోల్పోయి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి. పంటలు నిర్జీవమై భూమి ఎడారిగా మారి పోతుంది.
ఎడారీకరణ కారణాలు
జల వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. జీవ భౌతిక 'ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడం వలన భూమి ఉత్పాదకత తగ్గి ఎడారీకరణ సంభవిస్తుంది. కరువులు వరదలు:ప్రకృతి విపత్తులు కూడా సహజవనరుల క్రమ క్షయానికి కారణమై నేలలను నిస్సారంగా మార్చి వేస్తున్నాయి. రసాయనిక ఎరువులు పురుగు మందుల వినియోగం విస్తృతం కావడం వల్ల నేలను గుల్ల పరుస్తున్నాయి. సహజంగా భూసారాన్ని పెంచే వాన పాములు తేనే టీగలు వంటి పంట సహాయ కారులు చనిపోతున్నాయి.వరదల సమయంలో భూమి పై సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం చేత ఎడారీకరణ పెరుగుతుంది.
పట్టణీకరణ పారిశ్రామికీకరణ
నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ 'పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతుంది.
ఇది భూమి క్షీణతకు దోహధపడుతుంది.భూమి క్రమంగా ఎడారిగా మారుతుందని భూతాపం పెరిగి భూమి ఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని కరువు' కాటకాలు ఆకలి'చావులు సంభవిస్తున్నాయని పలు సామాజిక ఆర్థిక అద్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఎడారీకరణ_ ప్రపంచ దేశాలకు సమస్య
ఎడారీకరణ సమస్య ప్రపంచ దేశాలకు పెద్ధ సవాల్ గా పరిణమించింది. మానవుని స్వార్థ పూరిత చర్యలు తప్పిదాలు ప్రకృతి 'వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల వల్ల భూమి ఉత్పాదకత తగ్గి ఎడారీకరణ పెరిగే ప్రమాదం వుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని 'ఐ'రా'స హెచ్చరించింది.
యూ' ఎన్:సీ'సీ'డీ అంచనాలు
ఐ'రా'సకు చెందిన యూ'ఎన్ససి:సీ'డీ
అంచనాల ప్రకారం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను వ్యవసాయం కొరకు వినియోగించడం నేల' నీరు ' సంరక్షణ చర్యలు ఆశించనంతగ లేక పోవడం పరిమితికి మించి సాగు చేయడం నీటి యాజమాన్యం సక్రమంగా లేకపోవడం భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఏడారీకరణకు కారణాలని పేర్కొంది.
భూమి క్షీణత ఐ'రా'స నివేదిక
ఏటా 530 కోట్ల ‌ టన్నుల సారవంతమైన మట్టి 80లక్షలు టన్నుల వృక్ష పోషకాలు నేల కోల్పోతుంది . భూక్షీణత వల్ల 25 కోట్లమంది ప్రభావిత మౌతున్నారు. ప్రతి యేటా 12 మిలియిన్ హెక్టార్ల భూమిని కోల్పోతున్న…
🏠 Home