యాపిల్ కొరికి జనంపైకి విసిరిన డీకే..
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్గా మారింది. ఇటీవల ఆయన ఓ ర్యాలీలో సగం తిన్న యాపిల్ (Apple) పండ్లను జనంపైకి విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. డీకే తీరుపై ఆన్లైన్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర (Kanakapura) పరిధిలోని హారహళ్లి ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ ఘటన జరిగింది.