హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి
నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ముగ్గురు ఐటీ ఉద్యోగులు.. ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపుకు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో పశ్చిమబెంగాల్కు చెందిన ఐటీ ఉద్యోగి అబ్బాస్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో అభిరుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.