జూరాల ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం..
విహారంలో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సందర్శనకు వచ్చి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. ధరూర్ మండల జూరాల ప్రాజెక్టు రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన శివకుమార్(మల్లేపల్లి), గణేష్(పీర్లగుట్ట), శ్రీకాంత్ (పెద్దాయపల్లి) ముగ్గురు కలిసి బైక్ పై జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.