కదిలే బంధాలు కరిగే గుండెలు
శాస్త్ర సాంకేతికత పెరిగిఆధునిక విలాస జీవితాన్ని అనుభవిస్తున్న మానవుడు గోడల మధ్యన మనసులులేని మనుషుల మధ్య ఒంటరిగా జీవిస్తున్నాడు
ఒకే ఇంటిలో అందరు జీవిస్తున్న
ఎవరికి వారే యుమునా తీరే
అన్నట్లు ప్రత్యేక ఆలోచనా
ప్రపంచంలో మునిగి పోతున్నాడు
మనుషుల గుండెల మధ్యన
దూరాలు పెరుగుతున్నాయి
మాట మంచి ఓపికలు ఓదార్పు
నశించి పరనింద సంస్కృతి
రాజ్యమేలుతుంది ఒంటరితనం తనం ఇంటింట వటవృక్షంలా పెరుగుతోంది కుటుంబ బంధాలు బీటలు వారి బంధాలు అనుబంధాలు అడ్రస్ లేనివై అందరు ఉన్న అనాథల సంఖ్య పెరుగుతోంది వృద్ధాశ్రమాలే శరణ్యమైసామాజిక పునాదుల్ని
కదిలించే కలియుగ కలుషిత స్థితి ప్రభలడం శోచనీయం
నేటి మానవుడు సామాజిక మాధ్యమాల స్క్రీన్ల వెనుక
లైకులు వేటలో బతుకుతున్నాడు
పక్కన ఉన్న మనిషిని మరిచి
డిజిటల్ ప్రపంచంలో మునుగు తున్నాడురక్తం పంచి పెంచిన చేతులు నేడు పట్టుకునే దిక్కు లేక
వణుకుతున్నాయి ప్రాణంగా చూసుకున్న పిల్లలు బతుకు వేటలో పరదేశాల్లో బ్రతుకుతూ ఉంటే వృద్ధాప్యం దాపురించిన
తల్లిదండ్రులు అనాదలై ఆదుకునే వారి కొరకు ఎదురుచూస్తున్నారు
అడుగుల సప్పుడు వినపడక
తలుపుల వంక చూసి కళ్ళు
కాయలు కాచే పండుటాకులు
నిట్టూర్పుల మంటల్లో నిలువునా కాలిపోతోంది మానవత్వం.
వృద్ధులకు మందుల బిల్లల
తోడు మాత్రమే మిగిలింది
పలకరించే గొంతుక కోసం
ప్రాణం విలపిస్తోందివృద్ధుల కన్నీటి చుక్కల సాక్షిగా ఈ సమాజం ఒక బతుకున్న ఒక నిర్మానుష్య అరణ్యమైంది ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై
స్వతంత్ర కుటుంబాల సంఖ్య
విజృంభించి స్వేచ్ఛ వాదం
వర్ధిల్లుతుంది ఆర్థిక ఆధిపత్యం
కొనసాగుతోంది అందరు కలిసి నవ్వే రోజులు పోయాయి కష్టాలు పంచుకునే మనుసులు లేవు
మనిషికి మనిషి దూరమవుడమే
నేటి సమాజానికి పెద్ద శాపం
గుంపులో ఉన్న ఒంటరి బతుకులు
ఇదే నేటి ఆధునిక నరకమైంది
బంధాల వంతెనలు కడదాం
ప్రేమ అనురాగం ఆత్మీయత
అనుబంధాల పునాదులపై
ఆర్ధత అవగాహన పరోపకారం
జనహితమే పరమావధిగా
మెరుగైన సామాజిక సాంస్కృతిక
సంబంధాలతో నవ సమాజాన్ని
నిర్మిద్దాం మానవ మనుగడే
ద్యేయంగా వృద్ధులను ఆదరిద్దాం
ఒంటరితనానికి గుడ్బై చెప్పి
సమష్టి జీవన సౌరభంతో
సమాజంలో వెలుగులు నింపుదాం
(వృద్ధాప్యంలో ఒంటరి తనం గురించి స్పందిస్తూ రాసిన కవిత)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులుతెలంగాణ ఎకనామిక్ ఫోరం కాలమిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్ 9440245771
ఒకే ఇంటిలో అందరు జీవిస్తున్న
ఎవరికి వారే యుమునా తీరే
అన్నట్లు ప్రత్యేక ఆలోచనా
ప్రపంచంలో మునిగి పోతున్నాడు
మనుషుల గుండెల మధ్యన
దూరాలు పెరుగుతున్నాయి
మాట మంచి ఓపికలు ఓదార్పు
నశించి పరనింద సంస్కృతి
రాజ్యమేలుతుంది ఒంటరితనం తనం ఇంటింట వటవృక్షంలా పెరుగుతోంది కుటుంబ బంధాలు బీటలు వారి బంధాలు అనుబంధాలు అడ్రస్ లేనివై అందరు ఉన్న అనాథల సంఖ్య పెరుగుతోంది వృద్ధాశ్రమాలే శరణ్యమైసామాజిక పునాదుల్ని
కదిలించే కలియుగ కలుషిత స్థితి ప్రభలడం శోచనీయం
నేటి మానవుడు సామాజిక మాధ్యమాల స్క్రీన్ల వెనుక
లైకులు వేటలో బతుకుతున్నాడు
పక్కన ఉన్న మనిషిని మరిచి
డిజిటల్ ప్రపంచంలో మునుగు తున్నాడురక్తం పంచి పెంచిన చేతులు నేడు పట్టుకునే దిక్కు లేక
వణుకుతున్నాయి ప్రాణంగా చూసుకున్న పిల్లలు బతుకు వేటలో పరదేశాల్లో బ్రతుకుతూ ఉంటే వృద్ధాప్యం దాపురించిన
తల్లిదండ్రులు అనాదలై ఆదుకునే వారి కొరకు ఎదురుచూస్తున్నారు
అడుగుల సప్పుడు వినపడక
తలుపుల వంక చూసి కళ్ళు
కాయలు కాచే పండుటాకులు
నిట్టూర్పుల మంటల్లో నిలువునా కాలిపోతోంది మానవత్వం.
వృద్ధులకు మందుల బిల్లల
తోడు మాత్రమే మిగిలింది
పలకరించే గొంతుక కోసం
ప్రాణం విలపిస్తోందివృద్ధుల కన్నీటి చుక్కల సాక్షిగా ఈ సమాజం ఒక బతుకున్న ఒక నిర్మానుష్య అరణ్యమైంది ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై
స్వతంత్ర కుటుంబాల సంఖ్య
విజృంభించి స్వేచ్ఛ వాదం
వర్ధిల్లుతుంది ఆర్థిక ఆధిపత్యం
కొనసాగుతోంది అందరు కలిసి నవ్వే రోజులు పోయాయి కష్టాలు పంచుకునే మనుసులు లేవు
మనిషికి మనిషి దూరమవుడమే
నేటి సమాజానికి పెద్ద శాపం
గుంపులో ఉన్న ఒంటరి బతుకులు
ఇదే నేటి ఆధునిక నరకమైంది
బంధాల వంతెనలు కడదాం
ప్రేమ అనురాగం ఆత్మీయత
అనుబంధాల పునాదులపై
ఆర్ధత అవగాహన పరోపకారం
జనహితమే పరమావధిగా
మెరుగైన సామాజిక సాంస్కృతిక
సంబంధాలతో నవ సమాజాన్ని
నిర్మిద్దాం మానవ మనుగడే
ద్యేయంగా వృద్ధులను ఆదరిద్దాం
ఒంటరితనానికి గుడ్బై చెప్పి
సమష్టి జీవన సౌరభంతో
సమాజంలో వెలుగులు నింపుదాం
(వృద్ధాప్యంలో ఒంటరి తనం గురించి స్పందిస్తూ రాసిన కవిత)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులుతెలంగాణ ఎకనామిక్ ఫోరం కాలమిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్ 9440245771