🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 04 Aug, 2026 | Page: 1

ఉదయనిధి కామెంట్స్‌పై ఖుష్బూ ఆగ్రహం..

తమిళనాడులో మాజీ ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తంజావూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందిస్తూ ఉదయనిధిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖుష్బూ సుందర్, మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏ నాయకుడికీ తగదని పేర్కొన్నారు. ప్రజా వేదికపై మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలని, రాజకీయ విభేదాల పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
🏠 Home