🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Jul, 2026 | Page: 1

నారాయణపేటలో ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

- ​జనసేనలోకి భారీగా చేరికలు..
- కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ మణికంఠ గౌడ్ లు
​నారాయణపేట, జూలై 13 (బివికె న్యూస్)
నారాయణపేట జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. నాయకులు, కార్యకర్తల కలయికతో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి పార్టీలో చేరడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
​కార్యక్రమ నిర్వాహకులు మరియు అతిథులు
​ఈ ప్రతిష్టాత్మక సమావేశాన్ని నారాయణపేట జిల్లా నాయకులు, మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర యువజన విభాగం అడ్హక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
​ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంటరీ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర, నాయకులు చిరాగ్ ప్రజీత్ ప్రజీత్ గౌడ్ వంగ లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు సాంబశివుడు ముకుంద నాయుడు మేడలా రామకృష్ణ రవీందర్ గౌడ్ మహబూబ్ వీరామహిళలు శ్రీవల్లి రాగజ్యోతి సాయి శరత్ గౌడ్ బాలకృష్ణ ముకురాల కృష్ణ కురుమన్న తదితరులు విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు.
​శ్రేణులకు దిశానిర్దేశం.. వందలాదిగా చేరికలు
​కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు.. జిల్లా శ్రేణులను ఉద్దేశించి ఉత్సాహభరితమైన ప్రసంగాలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
​నాయకుల పిలుపు మేరకు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన సుమారు 100 మందికి పైగా యువకులు, అభిమానులు ఈ సమావేశంలో పార్టీలో చేరారు. వీరికి ముఖ్య అతిథి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కార్యక్రమం ఇన్చార్జి డాక్టర్ మణికంఠ గౌడ్ లు స్వయంగా జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
​కర్ణాటక సరిహద్దుల నుంచి విశేష స్పందన
​ఈ ఆత్మీయ సమ్మేళనానికి కేవలం స్థానిక జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా విశేష స్పందన లభించింది. కర్ణాటకలోని గురుమిట్కల్, రాయచూర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నారాయణపేటకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అంతేకాకుండా, అక్కడి నుంచి వచ్చిన పలువురు యువకులు సైతం ఈ వేదికగా అధికారికంగా జనసేన పార్టీలో చేరడం పార్టీకి ఉన్న విస్తృతమైన ఆదరణకు అద్దం పడుతోంది.
​స్థానిక నాయకులు, శ్రేణుల సమన్వయంతో విజయవంతంగా ముగిసిన ఈ ఆత్మీయ సమ్మేళనం నారాయణపేట జిల్లాలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ భారీ చేరికలతో జిల్లాలో జనసేన పార్టీ మరింత బలపడిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో నారాయణపేట జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గుడిసె నరసింహ కృష్ణ వెంకట్ అరుణ్ కుమార్ డీకే అశోక్ బాదేపల్లి నరేష్ గౌడ్ హనుమంతు బాలు రెడ్డి భీమేష్ ప్రవీణ్ ఉమేష్ షోఫీ శ్యామ్
కర్ణాటక నాయకులు వన్నప్ప బీరదర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home