సర్ సర్వేను విజయవంతం చేయాలి
అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చేయుతనందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ( MLA Marri Rajasekhar Reddy ) అన్నారు. నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్పార్టీ బీఎల్ఏలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్( SIR ) కార్యక్రమానికి గడువు కొద్ది రోజులే ఉందని, గడువులోగా ప్రతి ఒక్కరికి ఓటు నమోదు పత్రాలు పూర్తిచేసే విధంగా సహకారం అందించాలన్నారు. పత్రాలు అందరికి అందేలా బీఎల్ఏలు సహకరించాలని సూచించారు.